Sunday, May 19, 2024

ఏ యాత్రలు బీఆర్ఎస్ జైత్రయాత్రను ఆపలేవు

spot_img

సూర్యపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘రాహుల్‎కు ఉన్న ఏకైక అర్హత వారసత్వ అర్హతే. కుంభకోణాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. గాంధీ కుటుంబం మోడీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతుంది. బోఫోర్స్ కేసులో పీకల లోతు కూరుకు పోయిన చరిత్ర గాంధీ కుటుంబానిది. గుజరాత్ ఎన్నికల్లో అటువైపు చూడకపోవడమే కాంగ్రెస్, బీజేపీల లాలూచీ రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలకు జ్ఞానం, విజ్ఞానం, విచక్షణ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‎తో కాంగ్రెస్ బతుకు నాశనం అయింది. లక్ష కోట్ల అవినీతి జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కేసీఆర్ మీద మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మివేయడమే. కేసీఆర్ వల్లే తెలంగాణ ససశ్యామలం. పగటి దొంగలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి రాహుల్ అభాసుపాలు అయ్యాడు. ఏ యాత్రను చివరి వరకు ముగించిన చరిత్ర రాహుల్‎కు లేదు. ఏ యాత్రలు బీఆర్ఎస్ జైత్రయాత్రను ఆపలేవు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం’ అని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టంచేశారు.

Read Also: నడిరోడ్డు మీద జుట్టుపట్టుకొని కొట్టుకున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు.. వైరలవుతున్న వీడియో

Latest News

More Articles