Saturday, May 4, 2024

తెలంగాణపై బీజేపీ విషం కక్కుతున్నది

spot_img

పెద్దపల్లి జిల్లా: తెలంగాణపై బీజేపీ అగ్ర నాయకులు విషం కక్కుతున్నారని, పార్లమెంట్ సాక్షిగా రైతులకు రుణమాఫీ చేయమని చెప్పిన అమిత్ షాపై రైతులు కన్నెర్ర చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం ఖిలవనపర్తి గ్రామంలో మీడియాతో మాట్లాడారు.

‘‘గతంలో కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామని అన్నారు. ఇప్పుడు రైతుల రున మాఫీ చేయడం ఇష్టం లేదని అంటున్నారు. ఏ రకంగా రైతులకు మేలు చేసే ఆలోచ బీజేపీకి లేదు. ఈ 9 సంవత్సరాలలో బీజేపీ రైతులకు చేసింది ఏమీ లేదు.. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మడం తప్ప.

పెద్ద నోట్లను తీసుకువచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి… మళ్ళీ వాళ్ళే ఆ నోట్లోను రద్దు చేయడం విడ్డూరం. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువకులను మభ్య పెట్టారు. వారి అకౌంట్లో 15 లక్షలు ఇప్పటివరకు దిక్కులేదు. ఏ రకమైన ఎజెండా లేనటువంటి పాలన సాగిస్తుంది బీజేపీ ప్రభుత్వం. తొమ్మిది ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యం. అమిత్ షా మాట్లాడిన మాటలను తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండించాలి.’’ అని మంత్రి కొప్పులు పిలుపునిచ్చారు.

Latest News

More Articles