Tuesday, May 7, 2024

విశాఖ పరవాడ ఎన్టీపీసీ ప్రమాదంలో ఇద్దరి మృతి

spot_img

విశాఖపట్నం పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాద్రి ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. కేబుల్ ట్రాక్ బెల్ట్ తెగిపోవడంతో 15 మీటర్ల ఎత్తు నుంచి నిర్మాణ కార్మికులు కిందపడిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారుఎన్టీపీసీ అధికారులు. గాయపడిన ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు.

Latest News

More Articles