Sunday, May 19, 2024

సీఎం కేసీఆర్‌ పాలనకు అన్ని వర్గాలు మద్దతు

spot_img

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పరిపాలనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్‌ గ్రామం  కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు.. మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌  లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మాట్లాడిన మంత్రి… రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయన్నారు. బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి ఎదిగిందని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌  మహోన్నత నాయకులన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

Latest News

More Articles