Monday, May 20, 2024

తెలంగాణకు కర్ణాటక డబ్బు.. కేటీఆర్ సీరియస్

spot_img

రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక నుంచి వందల కోట్లను తెలంగాణకు పంపిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఇలాంటివి ముందే ఊహించామని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.

తెలంగాణలో స్కాంగ్రెస్‌కు నో చెప్పాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటకలో శుక్రవారం తెలంగాణకు రవాణా చేయడానికి ఉంచిన రూ.42 కోట్లను ఐటీ శాఖ పట్టుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ స్పందించారు.

Latest News

More Articles