Sunday, May 19, 2024

ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి

spot_img

గంభీరావుపేట మండల కేంద్రంలో 303 రెండు పడకల గదుల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఒక్క రోజులోనే 4 గ్రామాల్లో 378 రెండు పడుకల గదులు ప్రారంభించుకున్నాం. సిరిసిల్ల కు వచ్చుడు తక్కువ అయ్యింది ఎవరు తిట్టుకోవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్వర్యంలో బ్రహ్మాండంగా స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. 365 రోజులు మంచి నీళ్ళు, సాగు నీరు, అప్పర్ మనేరు లో నిల్వ చేసుకున్నాం.రైతుల దృష్టిలో పెట్టుకొని ఏన్నో గొప్ప గొప్ప ఆలోచనలు చేశారు. రైతుల ఖాతాలో 73 వేయిల కోట్లు రూపాలు వేసిన ఘనత కెసిఆర్. వారంటి లేని పార్టీ 6 గ్యారంటీలు ఇస్తే నమ్ముతారా.

ఇక జనాన్ని గందరగోళానికి గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని. పొరపాటున మొండి చేయి కి ఓటు వేస్తే మన బ్రతుకులు ఆగము అవుతాము. ఎంత ధైర్యం కావాలి నేను మందు పోయాను, పైసలు పాంచను అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా. కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల నుండి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టి గెలవాలని చూస్తుంది. డబ్బులు తీసుకొని కారు గుర్తుకు వేయండి. ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ని గెలిపించుకునే భాధ్యత మనదే. జిల్లా వ్యాప్తంగా గుడిసెలు 465, రేకుల షెడ్లు  432 శిథిలవస్థలో ఉన్న ఇండ్లు 907 మొత్తం 1967  వీరందరికీ ఇండ్లు కట్టి ఇస్తాం.

Latest News

More Articles