హైదరాబాద్ : దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్త దానం చేసారు. అంతకు ముందు బీఆర్ఎస్ భవన్కు చేరుకున్న కేటీఆర్కు తెలంగాణ భవన్లో దీక్షా దివస్ చేపట్టవద్దని ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది. అయితే దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్ఎస్ నేతలు వారికి వివరించారు. దీంతో రక్తదాన శిబిరం నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. అనంతరం కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు.
Also Read.. రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టుపై బీసీసీఐ కీలక నిర్ణయం