Saturday, May 4, 2024

టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు పీచర వెంకటేశ్వర్‌రావు కన్నుమూత

spot_img

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు, ఆలిండియా చైల్డ్‌ లేబర్‌ అడ్వయిజరీ బోర్డు మాజీ సభ్యుడు, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు పీచర వెంకటేశ్వర్‌రావు (57) మంగళవారం కన్నుమూశారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్‌ పీ అండ్‌టీ కాలనీకి చెందిన ఆయన అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ భవన్‌లో రక్త దానం చేసిన మంత్రి కేటీఆర్‌

పీచర వెంకటేశ్వర్‌రావు మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం తోర్నాలలో 1967 సెప్టెంబర్‌ 27న జన్మించారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు పొంది కేసీఆర్‌ పిలుపుతో 2001లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ వెంట నడిచిన డజన్‌ మంది సభ్యుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గడ్డిఅన్నారం మున్సిపల్‌ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఎల్బీనగర్‌ నియోజకవర్గ అడ్‌హాక్‌ కమిటీ సభ్యుడిగా ఆయన పనిచేశారు.

Latest News

More Articles