మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. సత్య నాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించినట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇండియా టూర్లో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్లో ‘చాట్ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ రోబోను నాదెళ్ల పరిచయం చేశారు. ఆ రోబోతో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏముంటాయని ఆయన చాట్ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అని తనను అవమానించొద్దన్నారు. దీంతో వెంటనే చాట్ రోబో క్షమాపణ చెప్పింది.