Monday, May 6, 2024

పెళ్లైన గంటకే భార్యకు విడాకులు..

spot_img

ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ ఘటన సంభాల్‌ జిల్లా అస్మోలీ ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సైదానగలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 5 ఏండ్ల క్రితం వివాహమైంది. అయితే దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అతడి భార్య పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో అతడు మరో గ్రామానికి చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పెళ్లి మండపానికి చేరుకుని గొడవకు దిగింది. తాను ఉండగా రెండో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించింది. పోలీసు కేసుతో ఇబ్బందులు కలుగుతాయని భావించిన పెద్దలు పంచాయితీ పెట్టారు. పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ వ్యక్తి పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చి.. అక్కడే ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Latest News

More Articles