Wednesday, May 22, 2024

పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి

spot_img

పనిచేసే ప్రభుత్వానికి, పనికి వచ్చే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్ . ఎవరో వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పగానే ఆగం కావద్దన్నారు.ఇవాళ( శుక్రవారం) సిరిసిల్ల పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహ ఆవిష్కరణను రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి జరిపారు. తర్వాత స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని, మీరు ఆశీర్వదిస్తేనే ఇక్కడ కూర్చున్నాం. కులమతాలకు అతీతంగా నాలుగు కోట్ల మంది కుటుంబానికి కేసీఆర్ కుటుంబ పెద్దగా అన్ని కులాలకు పెద్ద పీట వేస్తున్నారు. పనిచేసే నాయకుడు కేసీఆర్ అని, పని చేసే సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నది ఆయన తపన అని అన్నారు మంత్రి కేటీఆర్ . శాశ్వతంగా నీటి సమస్య తీరుస్తున్నారని.. 365 రోజులు చెరువులు కుంటలు నిండుకుండలా ఉంటాయన్నారు. గోదావరి జలాలతో నీటి సమస్య తీర్చే బాధ్యత తమపై ఉందన్నారు. కొనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్ ను సీఎం కేసీఆర్ వచ్చే నెలలో ప్రారంభిస్తారని తెలిపారు మంత్రి కేటీఆర్.

Latest News

More Articles