Sunday, May 19, 2024

గజ్వేల్‌లో ఈటల పోటీపై మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

spot_img

హుజూరాబాద్, గజ్వేల్‌ రెండు స్థానాల్లోనూ తాను పోటీ చేయబోతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. తన తూటాల్లాంటి మాటలతో ఈటలకు కౌంటర్ ఇచ్చారు. ‘బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో. ఈటల రాజేందర్ గజ్వేల్‌ లోనే కాదు.. ఇంకా 50 చోట్ల పోటీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పోటీ చేస్తున్న రెండు చోటా మేమే గెలుస్తాం’ అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

‘మతం, కులం ప్రాతిపదికన ఓట్లు కొంత వరకే పడతాయి. బీజేపీతో మాకు పొత్తుంటే ఇన్ని మైనారిటీ స్కూళ్ళు, కాలేజీలు ఎందుకు పెడతాం. సీఎం కేసీఆర్ మోడీని తిట్టినంతగా ఏ సీఎం తిట్టలేదు. బీజేపీతో స్నేహం ఉంటే ఎందుకు తిడతాం. మేము ప్రతీకార రాజకీయాలు చేయటం లేదు. మేము ఎవరేమన్నా అతి మంచితనంతో వెళుతున్నాం. రేవంత్ అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయటం లేదు. మా మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి. ఓటుకు నోటు కేసును ఓపెన్ చేయండి. ఎవరు వద్దన్నారు. ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించేది ప్రజలే. అధికారులు కాదు. అధికారుల బదిలీలను బదిలీలలుగా గానే చూస్తాం’ అని అన్నారు కేటీఆర్.

Latest News

More Articles