Sunday, May 19, 2024

రేపు జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయనున్న కేటీఆర్

spot_img

ఇళ్లులేని పేదలకు సొంతిళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్లు. ఈ పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ గురువారం పంపిణీ చేయనున్నారు. జడ్చర్లలోని ఎర్రగుట్టలో 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు లబ్ధిదారులకు మృగశిర కార్తె సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇండ్ల పట్టాలు అందజేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కావున ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు హాజరై కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని కోరారు.

Latest News

More Articles