Monday, May 6, 2024

ములుగులో కేటీఆర్.. కాస్సేపట్లో రామప్ప బహిరంగ సభ..!

spot_img

ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ తో పాటు నలుగురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, sp కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ ఛైర్మెన్ కుసుమ జగదీష్ లు పాల్గొన్నారు.

ఇక పలు అభివృద్ధి పనుల అనంతరం రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజలు చేయనున్నారు కేటీఆర్. మరికొద్ది సేపట్లో రామప్ప చెరువులో గోదావరి జలాలకు పూజలు చేసి.. అనంతరం రామప్ప లో బహిరంగ సభలో కేటీఆర్ తో పాటు మంత్రుల బృందం పాల్గొననుంది.

Latest News

More Articles