అతని పేరు ప్రశాంత్, పానీపూరి వ్యాపారం చేస్తుంటాడు. కానీ అమ్మేది మాత్రం గంజాయి. సమాచారమందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్లోని రామకృష్ణ థియేటర్ వద్ద గంజాయి అమ్ముతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్ పేట్లో గంజాయి కొని, రామకృష్ణ థియేటర్ వద్ద అమ్ముతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ప్రశాంత్ని అరెస్ట్ చేసి, రిమాండ్కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.