Friday, May 3, 2024

రాజాసింగ్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌ను ఓడిస్తున్నాం

spot_img

హైదరాబాద్ గోషామహల్ నియోజక వర్గాన్ని కూడా ఈసారి మేమే గెలుస్తామని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. 2018లో బీజేపీ గెలిచింది ఇదొక్కటే రాజాసింగ్ సీటని.. ఈసారి అక్కడ కూడా గెలుస్తామన్నారు. ఇవాళ(శుక్రవారం) మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్… బరాబర్ కాలికి బలపం కట్టుకొని తిరిగి ఓగొడతామన్నారు. రాసుకోండి..మోడీ కాదు.. ఢిల్లీ నుంచి ఇంకెవరు వచ్చినా బీజేపీ ఈసారి ఒక్క సీటు కూడా గెలవదన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో గెలిచింది ఒకటేనని .. ఈసారి అది కూడా గెలవదన్నారు.
ఇది కూడా చదవండి:మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ కుట్ర
కొడంగల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడగొట్టామని, ఈసారి కూడా ఓడిస్తామన్నారు మంత్రి కేటీఆర్. గోషామహల్‌ లో రాజాసింగ్‌ ను, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడగొడతాం… ఈ మూడు రాసుకోండి అని మీడియాతో అన్నారు. నేను చెప్పిన వీటికి మళ్లీ డిసెంబర్ 3న మాట్లాడుదామని చెప్పారు మంత్రి కేటీఆర్. గజ్వేల్ గురించి ప్రశ్నించగా… కేసీఆర్‌పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఎవరైనా ఎగురుతామనుకుంటే అది వారి ఖర్మఅని అన్నారు.

కామారెడ్డిలో తాను గెలవనని రేవంత్ రెడ్డే ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో చెప్పారన్నారు మంత్రి కేటీఆర్. అక్కడ రేవంత్ గెలవడు కానీ.. బిల్డప్ కోసం పోటీ చేస్తున్నాడన్నారు. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డి మీద ఓడిపోతే తనను తిడతారని, కనీసం కామారెడ్డిలో కేసీఆర్‌పై ఓడిపోతే చెప్పుకోవడానికి బాగుంటుందని పోటీ చేస్తున్నారన్నారు. కొడంగల్‌ లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా? అని అన్నారు. ఆయనను సొంత నియోజకవర్గ కొడంగల్ ప్రజలు తిరస్కరించారన్నారు మంత్రి కేటీఆర్.

ఇది కూడా చదవండి:డబ్బులకు సీట్లను అమ్ముకున్న రేవంత్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రం ఆగం

Latest News

More Articles