Saturday, May 18, 2024

త్వరలోనే ‘కీటెక్స్’ కంపెనీ ప్రారంభం

spot_img

వ‌రంగ‌ల్‌కు మ‌ళ్లీ పూర్వ వైభవం రానున్న‌ది. ఓరుగ‌ల్లుకు త‌ల‌మానిక‌మైన రీతిలో కాక‌తీయ టెక్స్‌టైల్ పార్క్ మ‌ళ్లీ జీవం పోసుకుంటోంది. దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్‌గా కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకుంటోంది. సుమారు 1350 ఎక‌రాల విస్తీర్ణంలో ఆ టెక్స్‌టైల్‌ పార్క్‌ను నిర్మిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఆ పార్క్‌కు చెందిన కొన్ని ఫోటోల‌ను మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. రాబోయే కొన్ని నెల‌ల్లోనే కీటెక్స్ యూనిట్ల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభిస్తార‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. టెక్స్‌టైల్ ఉత్ప‌త్తి రంగంలో వ‌రంగ‌ల్ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ఆక్ర‌మించుకోనున్న‌దని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

More Articles