ఐటీ రంగంలో దేశంలో భవిష్యత్తు అంతా టైర్ 2 నగరాలదే అని తెలిపారు మంత్రి కేటీఆర్. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా వరంగల్, ఖమ్మం, నల్గండ వంటి నగరాలు, పట్టణాలకు పరిశ్రమలు తీసుకువస్తోందన్నారు.ఇవాళ(శుక్రవారం) వరంగల్, హనుమకొండలో విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్..900కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మడికొండ ఐటీ పార్క్ లో 40 కోట్లతో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు.
ఈ కంపెనీ ద్వారా 500మందికి ఉపాధి లభించనుంది. ఆ తర్వాత సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్… రాబోయే 10 ఏండ్లలో హైదరాబాద్కు వరంగల్కు తేడా ఉండదు. వరంగల్లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలి. అక్కడా ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నాను. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను. బెంగళూరు ఐటీ రంగంలో 40శాతం తెలుగువాళ్లే. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కాలి. కులం, మతం పేరుతో కొట్టుకుచావడం మానాలన్నారు.
అంతేకాదు ఈ సభలో మాట్లాడుతూ వరంగల్కు మంత్రి కేటీఆర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ కు మెట్రో రైల్ లెక్క రానున్న రోజుల్లో వరంగల్ సిటీకి హైస్పీడ్ రైలు వస్తుందన్నారు మంత్రి కేటీఆర్.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం