Wednesday, May 22, 2024

నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్ దంపతులు

spot_img

మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ దంప‌తులు త‌మ ఓట్ల‌ను వేశారు.  ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ఒక బాధ్యత గల పౌరుడిగా తాను ఓటు హక్కును వినియోగించుకుని తన బాధ్యతను నిర్వహించానని చెప్పారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. అందరూ కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయాడానికి బయటకు రావాలని కోరారు. నగర ప్రజలు బయటకు వచ్చి నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి ఓటు వేయాలన్నారు.

ఇది కూడా చదవండి: ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ సినీ నటులు

Latest News

More Articles