మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని చాటేది ఓటన్నారు.. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్లోని 375వ పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధంలాంటిదన్నారు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావించి.. పోలింగ్లో పాల్గొనాలన్నారు.
ఇది కూడా చదవండి: ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ సినీ నటులు