Saturday, May 4, 2024

కురవి మండలం పెద్ద తండాలో ఓటు వేసిన మంత్రి సత్యవతి రాథోడ్

spot_img

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 67వ పోలింగ్ బూత్ లో మంత్రి సత్యవతి రాథోడ్ ఓటర్లతో కలిసి క్యూలైన్లో వెళ్లి తన ఓటు  వేశారు.  ఆ తర్వాత మాట్లాడిన మంత్రి.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది, బలమైనది శక్తివంతమైనది అన్నారు. మన అధికారాన్ని ఇతరులకు ఇచ్చి పరిపాలించమని ఇచ్చే గొప్పఅవకాశం అయిన ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని వేయాలన్నారు. ఓటు వేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న మంత్రి.. ఎన్ని అవాంతరాలు వచ్చినా సమయాన్ని కేటాయించి ఓటు వేయాలని ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్ దంపతులు

Latest News

More Articles