సిరిసిల్ల: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఈరోజు జరుపుకుంటున్న విద్యాదినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం గోరంట్యాలలోని పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డిపేటలో పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్కుమార్తోపాటు పలువురు నేతలు ఉన్నారు.