పత్తి రైతులకు విత్తన సరఫరా చేసే ఏజన్సీలు దోపిడీకి పాల్పడవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని చోట్ల పత్తి విత్తనాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. పట్టి రైతులని మోసం చేసే కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇక పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టించి పరిస్థితిని సొమ్ము చేసుకోకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో వాస్తవ అవసరాలతో పోలిస్తే ఎక్కువ పత్తి విత్తన నిల్వలను అందుబాటులో ఉంచామని ఆయన స్పష్టం చేశారు. రైతులు సాధారణంగా పత్తి సాగు కోసం బిజి II హైబ్రిడ్ విత్తనాలను ఇష్టపడతారు. అన్ని కంపెనీలు సరఫరా చేస్తున్న పత్తి విత్తనాలు ఒకే రకంగా ఉంటాయి. విత్తన రకాలను ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరిస్తారు. 450 గ్రాముల ప్యాకెట్కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర రూ.853′ అని చెప్పారు మంత్రి నిరంజన్రెడ్డి.