హైదరాబాద్: ట్విట్టర్ వేదిక గా కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరును ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కలేదని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం శోచనీయమన్నారు. మోదీ సర్కార్ చెబుతున్న భేటీ బచావో… భేటీ పడావో నినాదాలకే పరిమితమైనదని పేర్కొన్నారు. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి నేడు దాపురించిందని ధ్వజమెత్తారు.
మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం. ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే మోదీకి ముఖ్యమైందని, ఆడబిడ్డ తలుచుకుందని, ఇక మీ అడ్రస్ గల్లంతవుతుందని నిప్పులు చెరిగింది. ఈ మేరకు బండి సంజయ్ ట్వీట్ కు ఘటూగా బదులించింది.
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం
దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు
దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం… https://t.co/V05XeA3vR5
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 13, 2023