Friday, May 17, 2024

మీ దగ్గర ఉన్నోళ్లు రౌడీ షీటర్ లు, ప్రజల ఆస్తులు దోచుకున్నవారే కదా? మంత్రి అజయ్ ఫైర్

spot_img

ఖమ్మం జిల్లా : ఖమ్మం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఖనాపురం హవేలీ పరిధిలోని డివిజన్ ల బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు పాల్గొన్నారు.

Also REad.. ముందు నాపై పోటీ చేసి గెలువు రేవంత్.. తరువాత కేసీఆర్

ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. పాలేరు ప్రజల కాళ్ళు కడుతా అని తిరిగి తిరిగి.. ఇప్పుడు కొత్తగా ఖమ్మం ప్రజల కాళ్ళు కడుగుతా అని కొత్త రాగం ఎత్తుకోవడం విచిత్రంగా ఉందన్నారు. నా దగ్గర ఉన్నొల్లు అంత రౌడీలు, దొంగలు అంటూ విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర ఉన్న వాళ్ళు కేవలం ప్రగతిని కాంక్షించే వాళ్ళు, పేద ప్రజల అభ్యున్నతి కోసమే పని చేస్తున్నారని తెలిపారు.

Also Read.. 10 నిమిషాల వ్యవధిలో రెండు కాల్పులు.. ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మృతి

మీ దగ్గర ఉన్నోల్లు కేంద్ర సెంట్రల్ బ్యాంక్ ను నట్టేట ముంచి నిట్ట నిలువునా దోచుకున్న వాళ్ళు. రౌడీ షీటర్ లు, ప్రజల ఆస్తులు దోచుకున్నవారే కదా? మీరు పదవులు ఇచ్చినోళ్ళు సమర్థులు.. మేము పదవులు ఇస్తే అసమర్ధులా? మా దగ్గర ప్రజల కోసం పని చేసే వాళ్ళు.. బలహీన వర్గాల కు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు.వారి విధులను కూడా నువ్వే నిర్ణయిస్తావా.. నేను ఏది చెయ్యమంటే వాళ్లు చేస్తారా.. కొంచం అయినా బుద్ది ఉండాలి కదా? అని మండిపడ్డారు.

Also Read.. క్యాన్సర్‎తో బాధపడుతున్న 7 ఏండ్ల చిన్నారి.. డబ్బులేక దాతల సాయం కోసం ఎదురుచూపులు

వాళ్ల అధ్వర్యంలో పేదల గుడిసెలు నిర్ధక్ష్నీయంగా పికేశారు. కానీ నేను ఎవ్వరి గుడిసెలు పికలేదు. వాళ్లకు రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి డబ్బులు కూడా ఇప్పించినం. మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు.. మనం ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించే పని లో ప్రతిఒక్కరూ నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చింది కేవలం అభివృద్ది చేయడానికే తప్ప ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడం మా అభిమతం కాదు. అభివృద్ది మాత్రమే మా ఎజెండా అని స్పష్టం చేశారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఏ సర్వే తీసుకున్నా బిఆర్ఎస్ పార్టీనే గెలుసుతుంది అని రిపోర్ట్ ఉందని మంత్రి తెలిపారు.

Latest News

More Articles