Monday, May 20, 2024

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కేసీఆర్ కొనసాగిస్తున్నారు

spot_img

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నట్టు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాల్లో చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సర్దార్ సర్వార్ పాపయ్య గౌడ్ జయంతి పురస్కరించుకొని మీర్ పేట్ కార్పొరేషన్ లోని చందనం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి.. తర్వాత నివాళులు అర్పించారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్తులకు కూడా కోకాపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అదే విధంగా రైతన్నల లాగే, గౌడన్నలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. ఎక్కడికో వెళ్లి గీయకుండా, గౌడ్స్ కు ఇబ్బంది లేకుండా ఉండాలనే చెరువు కట్ట మీద ఈత చెట్లు పెట్టినట్లు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలకే ఉందన్నారు. ఆదాయం పెంచుకోవాలని మంత్రి సూచించారు. కులవృత్తుల వారికి అండగా ఉండాలని సీఎం కేసీఆర్ కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఒకప్పుడు ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునేవారని, నేడు నగరం నడి బొడ్డున నీరా కేఫ్ లు పెట్టి సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ ల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

Latest News

More Articles