రంగారెడ్డి జిల్లా: రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, రాష్ట్రానికి ఆయనే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. మన్సాన్పల్లి, గట్టుపల్లిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ లో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అలెర్ట్.. వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు..!
ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, రూ. 20 వేల కోట్లతో రైతులకు రుణమాఫి చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో మహేశ్వరంలోని విశ్వకర్మ, నాయిబ్రాహ్మణ, రజక, వడ్డెర, కుమ్మరి కుల సంఘాలకు 400 గజాల చొప్పున స్థలాలను కేటాయించి, నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్టు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ప్రజలు మద్దతు తెలిపాలని కొరారు.