Saturday, May 18, 2024

మేం హిందువులం అని చెప్పుకునే బీజేపీ నేతలు దేవాలయాలకు ఒక్క రూపాయి ఇచ్చారా?

spot_img

ఆధ్యాత్మికతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మేం హిందువులం అని గొంతు చించుకొని అరిచే వాళ్ళు దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని బీజేపీ నేతలకు మంత్రి సబిత చురకలు అంటించారు. మహేశ్వరం నియోజకవర్గం, ఆర్.కె.పురం డివిజన్‎లో పురాతనమైన ఖిల్ల మైసమ్మ టెంపుల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించిన సందర్భంగా అధికారులు, నాయకులతో కలిసి దేవాలయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భగవంతుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా పరిపాలిస్తున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా యాదాద్రి నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం కేసీఆర్‎కే సాధ్యమైందని మంత్రి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పురాతనమైన దేవాలయాల అభివృద్ధికి అడిగిన వెంటనే స్పందించి ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, ఆలయ ధర్మకర్తలు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Latest News

More Articles