Sunday, May 5, 2024

ధోనీ.. జీవా.. చెన్నై.. భావోద్వేగ క్ష‌ణాలు

spot_img

అహ్మాదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్ అయిదు వికెట్ల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్‌పై విజ‌యం సాధించింది. మిస్ట‌ర్ కూల్ ధోనీ.. త‌న మాస్ట‌ర్‌మైండ్‌తో చెన్నైకు 5వసారి ఐపీఎల్ ట్రోఫీను అందిచ్చాడు.

చివ‌రి రెండు బంతుల్లో 10 ర‌న్స్ అవ‌స‌ర‌మైన వేళ‌.. వరుసగా 6, 4 కొట్టి గెలిపించిన జ‌డేజాను ధోనీ ఎత్తుకున్నాడు. గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను కూడా ధోనీ ప్ర‌శంసించాడు. ఇక ధోనీ కూతురు జీవా కూడా మోదీ స్టేడియంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఆ అద్భుత క్ష‌ణాల‌కు చెందిన వీడియోను ఇవాళ ఐపీఎల్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

టాస్ ఓడి గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 214 ర‌న్స్ చేసింది. చెన్నై బ్యాటింగ్ ప్రారంభం కాగానే వర్షం వచ్చింది. 15 ఓవ‌ర్ల‌లో 171 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించారు. అయితే చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠగా సాగిన మ్యాచులో చెన్నై థ్రిల్లింగ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

Latest News

More Articles