Saturday, May 18, 2024

అదిలాబాద్ గడ్డపై అమిత్ షా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు

spot_img

ఆదిలాబాద్‌లో సభలో బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి సత్యవతి రాథోడ్. అదిలాబాద్ గడ్డపై అమిత్ షా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం స్థలం చూపించలేదని అనడం అర్ధంలేనిదన్నారు. సీఎం కేసీఆర్‌ 2014 నుండి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చాలా సార్లు ప్రధాని మోడీని కలిసి డిమాండ్‌ చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.గిరిజన వర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర ప్రభుత్వం 335ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఫైళ్లను సీఎం కేంద్రానికి నివేదించిన విషయం నిజం కాదా అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. 2016లో స్థలాన్ని పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపినా కుంటి సాకులు చెబుతూ కేంద్రం కాలయాపన చేసిందన్నారు.

గుంట భూమి కూడా కేటాయించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ నిచ్చిన కేంద్ర ప్రభుత్వం…తెలంగాణ గిరిజన యూనివర్సిటీని ఇవ్వకుండా వివక్ష చూపింది నిజం కదా అని అన్నారు  మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి… కేంద్రానికి పంపింతే ఇన్నేళ్లు ఆమోదించకుండా తొక్కిపెడుతోంది మీరు కదా అని అమిత్ షాను ప్రశ్నించారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదన్నారు.

గిరిజనుల  ఓట్లు దండుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఎన్నికల సమయంలో గిరిజన యూనివర్సిటీ ప్రకటన బీజేపనీ కుట్రలో భాగమేనన్నారు.10 ఏండ్లుగా తెలంగాణలోని గిరిజనులకు కేంద్ర బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ దొంగ హామీలు, మోసపూరిత వాగ్దానాలు మా గిరిజన బిడ్డలు ఎట్టి పరిస్థితిలో నమ్మరన్నారు.బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాబోయే రోజుల్లో గెలుపు బీఆర్ఎస్ దే నని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: ఎక్స్ లో మరో కీలక మార్పు

Latest News

More Articles