హైదరాబాద్: ఓటమి భయంతోనే హత్యా రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దుబ్బాక MLA అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డిపై కత్తి తో జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అమీర్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రి తలసాని.
Also Read.. కేటీఆర్ కారును తనిఖీ చేసిన ఎన్నికల సిబ్బంది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఈ విధమైన ఘటనలు జరగలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. 40 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఏదో చేస్తామని చెబుతున్నారు. ప్రజలు కాంగ్రెస్ ను నమ్మడం లేదు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు.