హైదరాబాద్: మినిస్టర్ రోడ్డులో పికెట్ నాలాపై 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని నాలాలను నేడు బాగు చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఆక్రమ నిర్మాణాలు, పూడిక పేరుకుపోయి నాలాల పరిసర కాలనీలు వరదముంపునకు గురవుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో SNDP కార్యక్రమం చేపట్టామని, ఆక్రమణలు, పూడిక తొలగింపు, నూతన బ్రిడ్జి ల నిర్మాణం వంటి నాలాల పూర్తిస్థాయి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. SNDP పనులు జరిగిన నాలాల పరిసరాల్లో వరద ముంపు సమస్య కనిపించదన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని తెలిపారు.