సికింద్రాబాద్: అనుమానమే లేదు 78 స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొండా డివిజన్ సాంబమూర్తి నగర్, ఆదయ్య నగర్, గ్యాస్ మండి లలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Also Read.. ఇంకా 2వేల నోట్లు ఉన్నాయా? వాటిని ఇలా డిపాజిట్ చేయండి
శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి వెళ్ళిన తలసాని తనకు ఓటు వేటు వేయాలని అభ్యర్ధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని, గ్రేటర్ లో అన్ని స్థానాలలో బిఆర్ఎస్ గెలుస్తుందన్నారు. మంత్రి తలసాని పుట్టి పెరిగిన ఆదయ్య నగర్ లోని ప్రజలు మనకు ఘన స్వాగతం పలికారు.