Sunday, May 19, 2024

రేవంత్ కు షాక్.. గాంధీభవన్ లో ఫ్లెక్సీలు కాల్చివేత

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల గొడవలు సద్దుమణగడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిక్కెట్లను అమ్ముకున్నారంటూ రోజుకో నాయకుడు గాంధీభవన్ వద్ద నిరసనలు చేస్తున్నారు. తాజాగా గాంధీభవన్ లో ఇబ్రహీంపట్నం కార్యకర్తలు రేవంత్ ఫ్లెక్సీలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దండేం రాంరెడ్డి వర్గీయులు గాంధీ భవన్ లో కుర్చీలను విరగ్గొట్టి రచ్చ చేసారు.

Also Read.. బీఆర్ఎస్ పుట్టిందే ప్ర‌జ‌ల కోసం.. ఆలోచించి ఓటేయాలి

ఈ సందర్భంగా దండెం రాంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ నుండి పార్టీలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసానని చెప్పారు. పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశానని, ఇప్పటికైనా మల్ రెడ్డి రంగారెడ్డిని మార్చి తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Latest News

More Articles