Sunday, May 19, 2024

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం

spot_img

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్, బోయినపల్లి అంబేద్కర్ మార్కెట్ యార్డ్‎లో రైతులకు సన్మానం చేశారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. రైతే రాజు అనే సంకల్పంతో రైతుబంధు, రైతు బీమా, సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు సాగుతున్నారన్నారు. రైతులను కళ్లలో పెట్టుకొని చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్‎పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ హారిక ఆనంద్ గౌడ్, బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, కంటోన్మెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles