Monday, May 6, 2024

జైలు నుంచి ఇంటికి చేరుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

spot_img

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో అరెస్టయి, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ మీద విడుదలై ఇంటికి చేరుకున్నారు. తన భార్య అనారోగ్య కారణాల నేపథ్యంలో మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోరారు. బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భార్య, కుటుంబ సభ్యులను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. భార్య, కుటుంబ సభ్యులు తప్ప మిగతా ఎవరిని కలవద్దని సిసోడియాను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడవద్దని, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడకూడదని షరతులు విధించింది.

Latest News

More Articles