Saturday, May 18, 2024

ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసమే మున్సిపల్ వార్డు ఆఫీసులు

spot_img

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతోనే వార్డు ఆఫీసుల ఏర్పాటు జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసమే ఈ మున్సిపల్ వార్డు ఆఫీసుల ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వార్డు ఆఫీసుల ద్వారా పరిష్కరించుకునే వీలుంటుందని ఆయన అన్నారు. దేశంలో ఈ తరహా వ్యవస్థ ఎక్కడా లేదని మంత్రి గర్వంగా చెప్పారు.

అమీర్ పేట, సనత్ నగర్‎లలో చిరు వ్యాపారుల కోసం నిర్మించిన షాపులను మంత్రి ప్రారంభించారు. చిరు వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ షాపుల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. వీటిని రేపు జూన్ 16న ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని షాపు యాజమానులకు భరోసానిచ్చారు.

Latest News

More Articles