Sunday, May 19, 2024

 మెడికల్‌ హబ్‌గా మారుతున్న తెలంగాణ

spot_img

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ మెడికల్‌ హబ్‌గా మారుతోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వరల్డ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ డే సందర్భంగా సొసైటీ ఫర్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ ఇండియా (సెమి) ఆధ్వర్యంలో ఇవాళ (శనివారం) హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో నిర్వహించిన 5కే, 10కే మారథాన్‌, సైక్లాథాన్‌ 10 కే రన్‌లను ఆయన ప్రారంభించారు.

ఆ తర్వాత మాట్లాడిని మంత్రి తలసాని… కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు మంత్రి తలసాని.

Latest News

More Articles