Tuesday, May 7, 2024

షార్జా వెళ్తున్న ప్రయాణికురాలి వద్ద భారీగా విదేశీ కరెన్సీ.. అదుపులోకి తీసుకున్న అధికారులు

spot_img

హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న ప్రయాణికురాలి వద్ద భారీగా విదేశీ కరెన్సీని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీన్ అల్విసా మొహమ్మద్ అనే మహిళ షార్జా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. అయితే ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఆమె లగేజీ బ్యాగులో 54 యునైటెడ్ ఎమిరేట్స్ దిర్హం నోట్లు గుర్తించారు. పట్టుబడ్డ కరెన్సీ విలువ ఇండియాలో 9 లక్షల 67, 440గా ఉంటుందని అధికారులు వెల్లడించారు. కరెన్సీని స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు.. విచారణ చేపట్టారు.

Latest News

More Articles