Friday, May 3, 2024

బీసీల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ విశేష కృషి

spot_img
  • 41 బీసీ కులాలకు 87.3 ఎకరాలు.. 95కోట్లతో ఆత్మగౌరవ భవనాలు
  • 2.5 ఎకరాలు, 5 కోట్లతో కోకాపేట్లో పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన
  • హాజరైన మంత్రులు హరీష్ రావ్, గంగుల కమలాకర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలో వెనుకకునెట్టేయబడ్డ బీసీలను అభివృద్ది పథంలోకి తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ప్రభుత్వం వేలకోట్ల విలువైన కోకాపేట్, ఉప్పల్ భగాయత్ భూములను 41కులాలకు కేటాయించి ఆత్మగౌరవ భవనాల్ని నిర్మిస్తుందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. నేడు కోకాపేట్లో 2.5 ఎకరాల్లో 5 కోట్లతో నిర్మిస్తున్న పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన కార్యక్రమంలో సహచర మంత్రులు హరీష్ రావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, కులవృత్తులకు చేయూత నిస్తూనే బలహీనవర్గాల్లో అక్షర చైతన్యం వెల్లివిరియడానికి 310 బీసీ గురుకులాలను నిర్వహిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తుందన్నారు. గతంలో దరఖాస్తు ఇచ్చి దండంపెట్టినా ఒక్క రూపాయి ఏ ప్రభుత్వం ఇవ్వలేదని నేడు సీఎం కేసీఆర్ పెద్దకొడుకుగా పేదింటి బిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ రూపంలో లక్ష రూపాయల్ని అందిస్తున్నారని, అత్యధిక శాతం ఉన్న బీసీలకు ఆసరా ఫించన్లలో పెద్ద మొత్తం కేటాయిస్తూ ఆత్మగౌరవంతో జీవించేలా భరోసానిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, ట్రస్ట్ సబ్యులు చింతా ప్రభాకర్, మచ్చ సుధాకర్, నాయకులు బొడ్ల తిరుపతితో పాటు నేతలతో పాటు బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest News

More Articles