జనగామ జిల్లా చిల్పూర్ మండలం గార్లగడ్డ తండాశివారు మల్లన్నగండి రిజర్వాయర్ లో బీటెక్ విద్యార్థి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈతకోసం రిజర్వాయర్ లోకి దిగిన బీటెక్ విద్యార్థి శేఖర్ నీటమునిగి మరణించాడు. మృతుడు స్వస్థలం దేవరుప్పుల మండలం దర్మగడ్డతండా అని పోలీసులు తెలిపారు.
మృతుడు వరంగల్ కిట్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ చుదువుతున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్ళి మృత్యువాత పడడంతో శేఖర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.