Friday, May 3, 2024

రైతాంగం గురించి ఆలోచించే ప్రభుత్వం మాది.. తడిసిన ధాన్యాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం

spot_img

నల్లగొండ జిల్లా: పంటల సాగును ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకుంటున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలనుండి రైతాంగాన్ని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఅర్ ఈ సంచలన నిర్ణయం తీసుకొన్నారని ఆయన వెల్లడించారు.

శనివారం నాడు జరిగిన నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, జెడ్ పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జెడ్ పి సి యి ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మే మాసాంతానికి మొదటి పంట.. నవంబర్ చివరికి రెండో పంటనాట్లు పూర్తీకి ప్రభుత్వం సంకల్పించిదని ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మార్చి చివరికి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందంటూ వివరించారు. అందుకు అనుగుణంగా జెడ్ పి ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా సభ ఏకగ్రవంగా తీర్మానించింది.

తుఫాన్ కు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణా అని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ తరహాలో భారత దేశంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన మరో రాష్ట్రం ఎక్కడా లేదన్నారు. విధానాలను అమలు పరిచే బాధ్యత వరకు శాసనకర్తలకు పరిమితమని, అమలు పరిచే బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంటుందని ఆయన పేర్కన్నారు.

యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతుపక్షపాతిగా పేరొందిన నేత అని ఆయన కితాబిచ్చారు. రైతాంగం గురించి ఆలోచించే మొట్టమొదటి ప్రభుత్వం మనదన్నారు.

ప్రతీ మీడియా హౌస్ కు ఓ ఎజెండా ఉందని ఆయన అన్నారు. జరుగుతున్న దానిని జరగ లేదని చెప్పేందుకు ఆ మీడియా హౌస్ లు పోటీ పడుతున్నాయన్నారు. అభివృద్ధి యిష్టం లేని పత్రికలు ఈ తరహ ప్రచారానికి పూనుకున్నరాని ఆయన మండి పడ్డారు. ఇన్నేళ్ల నుండి రైతాంగం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విరుచుకుపడ్డారు. ఎవరీ ఎజెండాలను ఉటంకించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి ట్రాప్ లో ఏ ఒక్కరూ పడొద్దని ఆయన ప్రజా ప్రతినిధులకు ఉద్బోధించారు.

Latest News

More Articles