పరిగి: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్వర్రెడ్డికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్వర్రెడ్డి ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరీశ్వర్రెడ్డి కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిని మంత్రులు ఓదార్చారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారి పార్థివదేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS, మంత్రులు @BRSHarish, @jagadishBRS, @VSrinivasGoud, ఎంపీ @DrRanjithReddy, తదితర… pic.twitter.com/Y0PlWV2KAO
— BRS Party (@BRSparty) September 23, 2023