Saturday, May 4, 2024

వచ్చేనెల 3 నుంచి ఈసీ పర్యటన.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు

spot_img

హైదరాబాద్: వచ్చే నెలలో 3, 4, 5 తేదీల్లో ఈసీ తెలంగాణలో పర్యటించనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని ప్రకటించారు.

Also Read.. సుప్రీంకోర్టుకు చేరిన చంద్రబాబు కేసు

ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతుంది. బోగస్ ఓట్లపై పిర్యాదులు వస్తున్నాయి. మేము పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు చేస్తాం. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాము. రాష్ట్ర ఎన్నికలకు రెండు, మూడు నెలలు నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Also Read.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలది విషప్రచారం

తాము షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలను ఈసీ ఖరారు చేస్తుంది. కేంద్రం, రాష్ట్రం కు చెందిన 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయి. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో సిబ్బందికి శిక్షణ ఉంటుంది. అనంతరం ఈవీఎంల చెకింగ్ జరుగుతుందని వివరించారు.

Latest News

More Articles