చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. అవయవ దానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు.
Also Read.. వచ్చేనెల 3 నుంచి ఈసీ పర్యటన.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు
మరణానంతర అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలని సూచించారు. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టాలిన్ తెలిపారు.