Sunday, May 19, 2024

అచ్చంపేట ప్రజల చిరకాల కోరిక సాగునీరు ప్రాజెక్టు

spot_img

అచ్చంపేట ప్రజల చిరకాల కోరిక సాగునీరు ప్రాజెక్టు అని అన్నారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఉమామహేశ్వర ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకంలో అడ్డు వస్తే ఎవరినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ప్రాజెక్టు విషయంలో కలిసి రావాలని ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

ఎమ్మెల్యే కావాలని ఆకాంక్ష ఉంటే బీఅర్ఎస్ పార్టీలోకి రావాలన్నారు.సీఎం కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించడానికి నేను సిద్ధమని అన్నారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ ఆదేశం.. నా ఆకాంక్ష అని అన్నారు. పదవులు గెలుపు ఓటములు సహజం కానీ.. రైతాంగానికి సాగునీరు అందించడంలో నా టికెట్ ను త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. రైతాంగాన్ని అడ్డం పెట్టుకొని కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటామంటే ఎంతటి వారినైనా వదిలి పెట్టనని ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ హెచ్చరించారు.

Latest News

More Articles