Monday, May 6, 2024

ఇంటర్ స్టేట్ ర్యాంకర్‎కి ల్యాప్ టాప్ గిఫ్ట్ ఇచ్చిన మంత్రి హరీశ్ రావు

spot_img

ఇంటర్‎లో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి మంత్రి హరీష్ రావు ల్యాప్ టాప్ అందజేశారు. పేద విద్యార్థికి చేయూతనిచ్చి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్న గుంటేపల్లి అశ్విత.. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో 986 మార్కులతో జిల్లా ఫస్ట్, స్టేట్ 8వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అశ్వితకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. ఉన్నత చదువుల్లో పైకి రావాలని, అందుకు పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హరీశ్ రావు భరోసానిచ్చారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించినందుకు తన బహుమతిగా ల్యాప్ టాప్ అందిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం సిద్దిపేటలో మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులను పిలిచి, అశ్వితను సన్మానించి, ల్యాప్ టాప్‎ను అందజేశారు. పై చదువుల్లో బాగా రాణించి, ఉద్యోగం సాధించి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Latest News

More Articles