Friday, May 17, 2024

ఇచ్చిన హామీలు ఎప్పుడు పూర్తి చేస్తారు..ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే క‌డియం

spot_img

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆర్థికాభివృద్ధి జరిగిందంటూ తెలిపారు.
కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల పేరిట 13 హామీలు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువత, రైతు, మహిళా డిక్లరేషన్లు ప్రకటించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు లెక్కిస్తే 420 ఉన్నాయి. ఆరు గ్యారంటీల అమలకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సరిపోదు. రుణమాఫీ సహా ప్రకటించిన డిక్లరేషన్లకు అయ్యే వ్యయం దీనికి అదనం. డిసెంబర్‌ 9న రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు.. అదే మేం అడుగుతున్నామన్నారు ఎమ్మెల్యీ కడియం.

నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. 119 నియోజకవర్గాల్లో 4.16లక్షల ఇళ్లకు రూ.24వేల కోట్లు అవసరం. బడ్జెట్‌లో కేవలం రూ.7వేల కోట్లే కేటాయించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారు. ఇంటిలో ఒక్కరికే ఇచ్చినా రూ.20వేల కోట్లు కావాలి. ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. రైతు రుణమాఫీ ఏవిధంగా.. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరణ జరిగింది. ఆ ప్రాజెక్టు విషయంలో గోరంతను కొండంత చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. కాళేశ్వరంతో అనేక రిజర్వాయర్లు వచ్చాయి.. నీటి నిల్వ సామర్థ్యం పెంచుకున్నాం. ఈ ప్రాజెక్టులో బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కెనాళ్లు, సబ్‌స్టేషన్లు ఉన్నాయి. దీనిలో ఒక భాగమైన మేడిగడ్డలో కేవలం 2, 3 పిల్లర్లు కుంగిపోయాయి. ఈ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోండి.. మాకు అభ్యంతరం లేదన్నారు కడియం శ్రీహరి.

ఇది కూడా చదవండి:ఐఐఎం- ఇండోర్ విద్యార్థికి రూ. కోటి ప్యాకేజీ..!!

Latest News

More Articles