Thursday, May 2, 2024

రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టిన కారు.. చార్మినార్‌ ఎక్సైజ్‌ సీఐ దుర్మరణం

spot_img

హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైంది. యూటర్న్‌ తీసుకుని రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన కారు ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చార్మినార్‌ ఎక్సైజ్‌ సీఐ సాధిక్‌ అలీ అక్కడికక్కడే చనిపోగా..నారాయణగూడ ఎక్సైజ్‌ ఎస్‌ఐ మొహీనుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

చార్మినార్‌ ఎక్సైజ్‌ సీఐ సాధిక్‌ అలీ, నారాయణగూడ ఎక్సైజ్‌ ఎస్‌ఐ మొహినుద్దీన్‌ నిన్న( మంగళవారం) అర్ధ రాత్రి ఎల్బీనగర్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై మలక్‌పేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాతచార్మినార్‌ ఎక్సైజ్‌ సీఐ సాధిక్‌ అలీ, నారాయణగూడ ఎక్సైజ్‌ ఎస్‌ఐ మొహినుద్దీన్‌ మంగళవారం రాత్రి ఎల్బీనగర్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై మలక్‌పేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ పారిపోయాడు. కారు వినూష పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. కారు డ్రైవర్‌ పారిపోయాడు. కారు వినూష పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. సీఐ సాదిక్ అలీ,ఎస్‌ఐ మొహీనుద్దీన్‌కు మలక్ పేట్ లోని ప్రభుత్వ కోటర్స్ లో ఉంటున్నారు.

ఇది కూడా చదవండి:బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..!!

Latest News

More Articles