అనారోగ్యం బారినపడిన తల్లిని చూసి తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం బి కేశవరం గ్రామానికి చెందిన తమ్మనపూడి ఆంజనేయులు, చంద్రసేన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు భువన్ అడ్డగుట్ట నాలుగో రోడ్డులో ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ సాప్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఆంజనేయులు మరణించాడు.
చంద్రసేన అప్పటికే రెండు సార్లు పక్షవాతానికి గురైంది. ఆమెను సొంతఊరులో సోదరి చూసుకుంటుంది మంగళవారం ఉదయం భువన్ ఉద్యోగానికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉంటరిగానే ఉన్నాడు. మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో పక్క గదిలో ఉంటున్న యువకులు వచ్చి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడు. తండ్రి చనిపోయి…తల్లిపక్షవాతానికి గురికావడంతో భువన్ మానసికంగా కుంగిపోయాడని బంధువులు తెలిపారు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న తరుణంలో తల్లి మరోసారి పక్షవాతానికి గురికావడం..ఆమె పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.